News February 16, 2025
తాజ్ మహల్ను సందర్శించిన రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్ బుక్లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.
Similar News
News March 28, 2025
ఉక్రెయిన్లో ఎన్నికలు జరగాలి: పుతిన్

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.
News March 28, 2025
ఇండియా రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే

1వ ర్యాంకు- ముకేశ్ అంబానీ (రూ.8.6 లక్షల కోట్లు)
2వ ర్యాంకు- గౌతమ్ అదానీ (రూ.8.4L కోట్లు)
3వ ర్యాంకు- రోష్ని నాడార్ (రూ. 3.5L కోట్లు)
4వ ర్యాంకు- దిలీప్ సంఘ్వీ (రూ.2.5L కోట్లు)
5వ ర్యాంకు- అజీమ్ ప్రేమ్జీ (రూ.2.2L కోట్లు)
6వ ర్యాంకు- కుమార మంగళంబిర్లా (రూ.2L కోట్లు)
6వ ర్యాంకు- సైరస్ పూనావాలా (రూ.2L కోట్లు)
8వ ర్యాంకు- నీరజ్ బజాజ్ (రూ.1.6 లక్షల కోట్లు)
News March 28, 2025
రేపు సూర్యగ్రహణం

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.