News December 19, 2024

అద్భుతమైన ఫొటో కోసం ప్రాణాలకు తెగించి!

image

వన్యప్రాణుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేం. అలాంటిది సింహాన్ని దగ్గర నుంచి ఫొటో తీయాలంటే సాహసమనే చెప్పాలి. పైన కనిపిస్తోన్న ఫొటోలో సింహానికి కోపమొస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. దీనిని ఫొటోగ్రాఫర్ అతిఫ్ సయీద్ 2015లో తీశారు. కారు నుంచి బయటకు దిగి ఫొటో తీస్తుండగా సింహం అతణ్ని గమనించింది. ఈ ఫొటో తీసిన వెంటనే సింహం అతనిపై దాడి చేసింది. కారు డోరు ఓపెన్ ఉండటంతో అతను బతికిపోయాడు.

Similar News

News January 25, 2025

నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల

image

ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

News January 25, 2025

దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్

image

AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.

News January 25, 2025

MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.