News May 24, 2024
అభిమానులతో సరదాగా గడిపిన రోహిత్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన అభిమానులతో ఆయన సరదాగా గడుపుతున్నారు. వారితో సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం రేపు రోహిత్ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు మరికొందరు ఆటగాళ్లు కూడా యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం.
Similar News
News February 7, 2025
వైద్యశాస్త్రంలో అరుదు.. మోచేతిపై పురుషాంగం

వైద్యశాస్త్రంలోని సంఘటనలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే HYDలో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాడు. వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్లో అమర్చారు.
News February 7, 2025
ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 7, 2025
బీసీ, ఈబీసీలకు శుభవార్త

AP: స్వయం ఉపాధి కోసం BC కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 12 వరకు పొడిగించింది. అర్హులైన BC, EBCలు అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సవిత సూచించారు. కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీపార్లర్లు తదితర యూనిట్లకు రూ.2-5లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% సబ్సిడీ లభిస్తుంది.
వెబ్సైట్: <