News November 15, 2024
రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్కు వచ్చేస్తారు’ అని తెలిపారు.
Similar News
News December 18, 2025
గాలి కాలుష్యాన్ని అలా తగ్గించాం: చైనా ఎంబసీ

గాలి కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజింగ్లో తాము ఎలా పొల్యూషన్ను అరికట్టామో ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ వెల్లడించారు. ‘దశలవారీగా పాత బండ్లను తొలగించాం. సరి-బేసి అమలు చేశాం. అతిపెద్ద మెట్రో, బస్ నెట్వర్క్లు ఏర్పాటు చేశాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచాం. 3వేల భారీ పరిశ్రమలను మూసేశాం. ఫ్యాక్టరీలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చాం’ అని వివరించారు.
News December 18, 2025
ఇన్సూరెన్స్ కాల్స్ ‘1600’ నంబర్ల నుంచే రావాలి: TRAI

స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్ల నుంచే రావాలని పేర్కొంది. ఈ నిబంధనను IRDAI పరిధిలోని అన్ని బీమా సంస్థలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫేక్ కాల్స్, ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని TRAI భావిస్తోంది.
News December 18, 2025
భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్ మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.


