News May 2, 2024
ముంబై కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్గా లేకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ తొలిసారి స్పందించారు. ‘నేను ఇప్పుడు టీమ్ఇండియా కెప్టెన్గా ఉన్నా. రేపు ఉండకపోవచ్చు. ఇదంతా జీవితంలో ఒక భాగం. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. గతంలోనూ నేను ఇతరుల నాయకత్వంలో ఆడా. ఒక ప్లేయర్గా రాణించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. గత నెల రోజులుగా అదే చేస్తున్నా’ అని హిట్మ్యాన్ చెప్పారు.
Similar News
News December 11, 2025
ఒకే రోజు.. ఇటు హీరో, అటు విలన్!

ఆది పినిశెట్టి నటించిన ‘అఖండ-2’, ‘డ్రైవ్’ సినిమాలు ఒకే రోజున(DEC 12) రిలీజ్ అవుతున్నాయి. ‘అఖండ-2’లో మంత్రగాడిగా విలన్ రోల్లో, ‘డ్రైవ్’ మూవీలో హ్యాకింగ్ బారిన పడిన మీడియా దిగ్గజంగా నటించారు. రెండు సినిమాల్లోని పాత్రలకు, గెటప్లకు అసలు పోలికే లేదు. ఒకే వ్యక్తి ఇటు హీరోగా, అటు విలన్గా నటించిన సినిమాలు ఇలా ఒకే రోజున విడుదలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి ఆది డబుల్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
News December 11, 2025
ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్టాపిక్గా మారింది. ఈ స్కీమ్ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.
News December 11, 2025
ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.


