News July 29, 2024
ఏసీలు లేని గదులు.. ఒలింపిక్స్ అథ్లెట్ల తిప్పలు

చరిత్రలోనే అత్యంత ప్రకృతిహితమైన ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆటగాళ్ల గదుల్లో పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఏసీలు ఏర్పాటు చేయలేదు. దీంతో అథ్లెట్లు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా డిమాండ్లు, విమర్శలు రావడంతో ఎట్టకేలకు తాత్కాలికంగా 2500 ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలపైనా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.