News December 15, 2024
రేపు అసెంబ్లీలో ROR బిల్లు?

TG: రేపు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్ఓఆర్) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రిమండలి భేటీలో బిల్లుకు ఆమోదముద్ర వేస్తారని సమాచారం. ఇప్పటికే ముసాయిదాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు పంచాయితీరాజ్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News April 14, 2026
40 నిమిషాల పాటు మోదీ-ట్రంప్ ఫోన్ కాల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్లో 40 నిమిషాల పాటు మాట్లాడారు. US-ఇరాన్ సీజ్ఫైర్ ప్రకటించాక వీరిద్దరూ కాల్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. హార్ముజ్ భద్రతపైన కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
News April 14, 2026
దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి
News April 14, 2026
చమురు భగభగతో భారత్ జీడీపీకి ఎఫెక్ట్: S&P

చమురు ధరల భగభగ నేపథ్యంలో మరో ఏజెన్సీ భారత్ GDP గ్రోత్పై తన అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది బ్యారెల్ ధర సగటున 130 డాలర్లుగా కొనసాగితే FY27లో గ్రోత్ 0.8% తగ్గొచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. FY27లో భారత్ జీడీపీ గ్రోత్ 7.1% ఉండొచ్చని గత నెల అంచనా వేసింది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ <<19592068>>సంస్థ<<>> కూడా మూడు నెలల పాటు చమురు ధర $150 వద్ద కొనసాగితే గ్రోత్ రేట్ 5.7%కే పరిమితమవుతుందని పేర్కొంది.


