News June 4, 2024
RRR రాకింగ్
ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రాజు ఆ తర్వాత జగన్తో విబేధాలు, పార్టీ వైఖరి నచ్చక బయటకు రావడం తెలిసిందే.
Similar News
News October 7, 2024
మహాచండీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు విజయవాడ దుర్గమ్మ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ దేవి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. మరోవైపు వరంగల్ జిల్లా భద్రకాళీ దేవస్థానంలో లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
News October 7, 2024
బంగ్లాపై గెలుపు.. టీమ్ ఇండియా రికార్డులు
తొలి T20లో బంగ్లాదేశ్పై ఘన <<14290970>>విజయం<<>> సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్లను అత్యధికసార్లు(42) ఆలౌట్ చేసిన టీమ్గా పాక్ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఆ తర్వాత కివీస్(40), ఉగాండా(35), విండీస్(32) ఉన్నాయి. అలాగే 120+ పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత వేగంగా(11.5 ఓవర్లు) ఛేజ్ చేసింది. సూర్య సేనకు ఇదే ఫాస్టెస్ట్ ఛేజ్. 2016లో బంగ్లాపైనే 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
News October 7, 2024
Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్
గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.