News January 31, 2025
మొగిలిగిద్ద ZPHSకు రూ.10 కోట్లు మంజూరు

TG: RR(D) ఫరూక్నగర్(మ) మొగిలిగిద్ద ZPHS స్కూలు 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న CM రేవంత్ రెడ్డి పాఠశాలపై వరాల జల్లు కురిపించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేశారు. పాఠశాల నూతన భవనం, గ్రంథాలయ భవన నిర్మాణాలకు రూ.10 కోట్లు, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాల కోసం రూ.5 కోట్లు, పంచాయతీ కార్యాలయం కోసం రూ.50లక్షలు, జూనియర్ కాలేజీలో మౌలిక సదుపాయాలకు రూ.50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 30, 2025
అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.
News October 30, 2025
నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

AP: నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు.


