News February 11, 2025
మద్యం బాటిల్పై రూ.10 పెంపు: కమిషనర్

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.
Similar News
News November 23, 2025
JGTL: TRTF జిల్లా అధ్యక్షుడిగా సురేష్

TRTF జిల్లా అధ్యక్షుడిగా తుంగూరు సురేష్, ప్రధాన కార్యదర్శిగా గుర్రం శ్రీనివాస్గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ప్రకటించారు. జగిత్యాలలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితో పాటు 10 మంది రాష్ట్ర కౌన్సిలర్లు, 6 గురు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు,10మంది ఉపాధ్యకులు, 6గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, 10మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.
News November 23, 2025
ముత్తుసామి సూపర్ సెంచరీ

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.
News November 23, 2025
672 Sr రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 Sr రెసిడెంట్/Sr డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి MBBS, DNB/MD/MS/PhD/MSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష DEC 13న నిర్వహిస్తారు. వెబ్సైట్: www.aiimsexams.ac.in/


