News December 28, 2024

నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు

image

AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 24, 2025

నవదుర్గలు – పఠించాల్సిన మంత్రాలు (2/2)

image

6. శ్రీ సరస్వతీ దేవి: ఓం ఐం సరస్వత్యై నమ:
7. దుర్గాదేవి: ఓం దుం దుర్గాయై నమ:
8. మహిషాసుర మర్దని: ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమ:
9. శ్రీ రాజరాజేశ్వరీ దేవి: ఓం హ్రీం రాజ రాజేశ్వరీ మాత్రే నమ:

News September 24, 2025

ఇవాళ తిరుమలకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి CBN దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ సా.6.20 గంటలకి తిరుమల చేరుకుంటారు. రా.7.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం విజయవాడకు బయల్దేరుతారు.

News September 24, 2025

ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

image

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.