News November 11, 2024

రైతులకు రూ.20,000.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్(రైతు భరోసా) పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News November 15, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 15, 2025

ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>>లో 28 సైంటిస్ట్-B పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/