News July 26, 2024
వరద బాధితులకు రూ.3వేల సాయం: చంద్రబాబు

AP: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘జిల్లా మంత్రులు వరద బాధితులను వెంటనే పరామర్శించాలి. వారి కుటుంబాలకు తక్షణం రూ.3వేల సాయం అందించాలి. అధికారులు పంటనష్టం వివరాలు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం. పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది. బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తాం’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
Similar News
News November 24, 2025
బొత్తప్పగూడెం: సంగంవాగులో మునిగి యువకుడు మృతి

వాగులో స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మునిగపోయిన ఘటన కామయ్యపాలెం పంచాయతీ బొత్తప్పగూడెంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు..తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటలోని దొంతికుంట కాలనికి చెందిన గుమ్మళ్ల యశ్వంత్ స్నేహితులతో కలిసి స్నానానికి సంగం వాగులో దిగి గల్లంతయ్యాడు. తోటివారి సమాచారంతో సమీపంలో ఉన్నవారు వాగులో గాలించి బాలుడి డెడ్ బాడీని బయటకు తీశారు.
News November 24, 2025
4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 24, 2025
PGIMERలో 151 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER)లో 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.800, PwBDలకు ఫీజు లేదు. డిసెంబర్ 6న పరీక్ష నిర్వహిస్తారు. https://pgimer.edu.in


