News April 12, 2025

డిస్కంలకు రూ.4,470 కోట్ల సబ్సిడీ నిధులు

image

AP: 2025-26 తొలి త్రైమాసికానికిగాను మూడు డిస్కంలకు సబ్సిడీ సొమ్ము విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.4,470 కోట్లను డిస్కంల ఖాతాల్లో జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ఆదేశిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. ప్రజలపై టారిఫ్ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News March 23, 2026

CGD నెట్వర్క్‌తో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

image

AP: LPG కొరత నేపథ్యంలో ఇళ్లకు, వ్యాపారాలకు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) పంపిణీకి GOVT చర్యలు చేపట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు GO జారీచేసింది. PNG సరఫరాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు విధివిధానాలను నిర్దేశించింది. పైప్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అనుమతులు వంటివి వేగంగా పూర్తయ్యేలా గడువు విధించింది. ఇందుకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది.

News March 23, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు: టీమ్

image

పవన్ కళ్యాణ్ కొత్తగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదని ఆయన ప్రొడక్షన్ టీమ్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ప్రారంభించే ప్లాన్ లేదని, ఏదైనా ఉంటే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపింది. ‘OG-2’ సినిమా గురించి ఆయనే సరైన సమయంలో ప్రకటన చేస్తారని పేర్కొంది.

News March 23, 2026

యుద్ధంపై 3 ముక్కలాట.. అసలేం జరుగుతోంది?

image

యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని, 5 రోజులు <<19457337>>దాడులు నిలిపేస్తామని<<>> తొలుత ట్రంప్ ప్రకటించారు. కానీ USతో తాము <<19457474>>సంప్రదింపులే<<>> జరపలేదని ఇరాన్ తెలిపింది. దీంతో నిన్న రాత్రే చర్చించామని, 5రోజుల్లో డీల్ కుదరొచ్చని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఇంతలోనే టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ చెప్పడం కన్ఫ్యూజన్‌ను ఇంకా పెంచింది.