News April 14, 2024

విద్యుత్ షాక్‌తో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

image

TG: విద్యుత్ షాక్‌తో మరణిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ పరిహారం అందజేస్తుంది. ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ సంబంధిత డాక్యుమెంట్లను విద్యుత్ కార్యాలయంలో సమర్పిస్తే ఏఈ, డీఈ విచారణ ఆధారంగా పరిహారాన్ని పొందవచ్చు. శాఖ పరమైన తప్పిదాల వల్ల మరణిస్తేనే పరిహారం చెల్లిస్తారు.

Similar News

News March 28, 2026

ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

image

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.

News March 28, 2026

ఈ లెజెండరీ IPL టీమ్‌పై మీ అభిప్రాయం?

image

IPL చరిత్రలోని బెస్ట్ ప్లేయర్స్‌తో కూడిన టీమ్‌ను స్పోర్ట్స్‌కీడా ఇలా సెలక్ట్ చేసింది. వార్నర్, రోహిత్ (కెప్టెన్) ఓపెనర్లుగా, కోహ్లీ, రైనా, డివిలియర్స్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా నిలుస్తారు. ధోని కీపర్‌గా.. పాండ్య, జడేజా ఆల్‌రౌండర్లుగా రాణిస్తారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, బుమ్రా, మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా మార్పులు చేస్తారా? Comment

News March 28, 2026

ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదు: స్పీకర్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ CM CBN అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ‘శాశ్వత రాజధాని నిర్మాణానికి సీఎం సంకల్పించారు. ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపం. 2019లో రాజధాని ప్రగతికి అడ్డంకులు ఎదురయ్యాయి. దాన్ని శాశ్వతంగా తొలగించే యజ్ఞమిది’ అని పేర్కొన్నారు.