News December 2, 2024
ఎక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.5లక్షల జరిమానా

AP: మద్యం అమ్మకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మద్యాన్ని MRP కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ.5లక్షల ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వైన్స్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా రూ.5లక్షల జరిమానా ఉంటుందని, బార్ లైసెన్సులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
Similar News
News January 9, 2026
ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.
News January 9, 2026
NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


