News August 9, 2024
గంజాయి సమాచారమిస్తే రూ.5,000: మంత్రి సుభాష్

AP: గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యాసంస్థలు, పరిశ్రమల వద్ద గంజాయి అమ్ముతున్న/తాగుతున్న వారి సమాచారం తనకు లేదా పోలీసులకు చేరవేయాలని ప్రజలకు సూచించారు. ఇలా తెలిపిన వారికి రూ.5,000 నగదు బహుమానం తన సొంత నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు.
Similar News
News April 16, 2026
ముంబై స్కోర్ ఎంతంటే?

IPL: పంజాబ్తో మ్యాచులో ముంబై 20 ఓవర్లలో 195/6 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ సెంచరీతో అదుర్స్ అనిపించారు. 60 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 112* రన్స్ చేశారు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50) రాణించారు. రికెల్టన్ (2), సూర్య (0), పాండ్య (14), రూథర్ఫోర్డ్ (1) నిరాశపరిచారు. అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు.
News April 16, 2026
మాజీ పీఎంలనూ వదలని బాలెన్ షా!

నేపాల్ పీఎం బాలెన్ షా సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. తన ప్రభుత్వంలోని పలువురు సహా గత ప్రభుత్వాల్లోని పీఎంలు, అధికారులు, మంత్రుల ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించారు. ఫేజ్-1లో 2006 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు, ఫేజ్-2లో 1991-2005 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న పార్టీల నేతలపై దర్యాప్తు చేయించనున్నారు. ఇందులో దాదాపు 17 మంది మాజీ దేశాధినేతలు, ఎక్స్ పీఎంలు ఉన్నట్లు సమాచారం.
News April 16, 2026
మాజీ పీఎంలనూ వదలని బాలెన్ షా!

నేపాల్ పీఎం బాలెన్ షా సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. తన ప్రభుత్వంలోని పలువురు సహా గత ప్రభుత్వాల్లోని పీఎంలు, అధికారులు, మంత్రుల ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించారు. ఫేజ్-1లో 2006 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు, ఫేజ్-2లో 1991-2005 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న పార్టీల నేతలపై దర్యాప్తు చేయించనున్నారు. ఇందులో దాదాపు 17 మంది మాజీ దేశాధినేతలు, ఎక్స్ పీఎంలు ఉన్నట్లు సమాచారం.


