News December 15, 2024

ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు రాగా ప్రతి 500కు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు 30-35 ప్రశ్నలు అడిగి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5,00,000 ఇవ్వనుంది.

Similar News

News January 8, 2026

ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

image

పూజ గదిలో చిత్రపటాలను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి పటాలను కలిపి ఉంచడం శుభకరం. పగిలిన లేదా చినిగిపోయిన పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. పటాలకు ప్రతిరోజు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 8, 2026

SIR రెండో విడతలో 6.5 కోట్ల ఓట్లు తొలగింపు

image

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో విడతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాల నుంచి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. SIRకు ముందు ఈ రాష్ట్రాల్లో 50.90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 44.40 కోట్లకు తగ్గింది. ఇటీవల ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే <<18779886>>2.89కోట్ల మంది<<>> ఓటర్లను తొలగించారు.

News January 8, 2026

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

image

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.