News December 25, 2024
వచ్చే నెలలోనే వారి ఖాతాల్లో రూ.6,000?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735087772438_1226-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. వీరిలో 70శాతం దళితులేనని తెలిపింది. భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని చూస్తోంది. మొదటి విడతగా వచ్చే నెలలో రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
Similar News
News January 24, 2025
VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737713956174_746-normal-WIFI.webp)
చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.
News January 24, 2025
ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737719072113_893-normal-WIFI.webp)
TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
News January 24, 2025
బీఆర్ఎస్ పార్టీకి షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737718645191_367-normal-WIFI.webp)
TG: కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.