News March 7, 2025
సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షలు: అచ్చెన్న

APలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 39 మంది అన్నదాతలు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి కుటుంబాలకు త్వరలో రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 2024 జూన్కు ముందు 103 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 49 కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల చేశామన్నారు. మరో 32 కేసులకు రూ.2.24 కోట్లను త్వరలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం: కిషన్ రెడ్డి

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర CM స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోదీ సర్కారు. రూపీ సింబల్ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.
News March 16, 2025
మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.
News March 16, 2025
ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్డేట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.