News March 7, 2025

సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షలు: అచ్చెన్న

image

APలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 39 మంది అన్నదాతలు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వీరి కుటుంబాలకు త్వరలో రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. 2024 జూన్‌కు ముందు 103 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 49 కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల చేశామన్నారు. మరో 32 కేసులకు రూ.2.24 కోట్లను త్వరలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.

News April 17, 2026

భారత్‌కు సౌత్ కొరియా అధ్యక్షుడు

image

సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత్ పర్యటనకు రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 19వ తేదీ ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా లీ పర్యటన సాగనుంది. మరోవైపు పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలకాంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News April 17, 2026

అహాన్, అనీత్.. మరో సినిమాకు ‘సై’యారా

image

బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై <<17590211>>బాక్సాఫీస్‌ను<<>> షేక్ చేసిన సినిమా ‘సైయారా’. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ జంట మరో రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమైంది. సైయారా తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సూరి, ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి, 2027లో మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.