News August 3, 2024
నీట్ రాకముందు ఒక్కో పీజీ సీటుకు రూ.8-13 కోట్లు: నడ్డా

దేశంలో నీట్ రాకముందు మెడికల్ ఎడ్యుకేషన్ బహిరంగ వ్యాపారంగా ఉండేదని, భారీ అవినీతి జరిగేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ అబ్దుల్లా రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి స్పందించారు. నీట్ ప్రవేశపెట్టక ముందు ఒక్కో పీజీ సీటు రూ.8కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు అమ్ముడుపోయేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు.
Similar News
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ లండన్లో హతమార్చాడు
News March 13, 2026
ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.


