News December 6, 2024
ఆర్టీసీ పికప్ వ్యాన్ల సేవలు ప్రారంభం

TGSRTC దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ECIL-LB నగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించింది. విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు వెళ్లే వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.
Similar News
News April 16, 2026
నవ గ్రహాలు – వాటి సొంత రాశులు

సూర్యుడు – సింహ రాశికి అధిపతి.
చంద్రుడు – కర్కాటక రాశికి అధిపతి.
బుధుడు – మిథున, కన్య రాశులకు అధిపతి.
కుజుడు – మేష, వృశ్చిక రాశులకు అధిపతి.
శుక్రుడు – వృషభ, తులా రాశులకు అధిపతి.
గురువు – ధనుస్సు, మీన రాశులకు అధిపతి.
శని – మకర, కుంభ రాశులకు అధిపతి.
రాహు, కేతువులు ఛాయాగ్రహాలు. అందువల్ల వీటికి ప్రత్యేక గృహాలు లేవు.
News April 16, 2026
‘దోశ, ఇడ్లీ..’ పాట.. BCCIకి CSK ఫిర్యాదు!

బెంగళూరు వేదికగా ఏప్రిల్ 5న RCBతో జరిగిన మ్యాచ్లో DJ ‘దోశ, ఇడ్లీ, సాంబార్’ పాటను ప్లే చేయడాన్ని CSK మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. దీనిపై ఫిర్యాదు చేస్తూ BCCIకి లెటర్ రాసినట్లు ఫ్రాంచైజీ MD కాశీ విశ్వనాథన్ తెలిపారు. తమ ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, స్టేడియంలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని IPL గవర్నింగ్ కౌన్సిల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News April 16, 2026
నదిలో నాణేలు వేస్తున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. స్నానాంతరం శుభ్రమైన దుస్తులు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందంటున్నారు పండితులు.


