News April 11, 2024

రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 2/3

image

సత్యయుగంలో ఇంద్రాపూర్ (ప్రస్తుతం అస్సాంలోని ధుబ్రీ) తమ రాజ్య రాజధాని అని ఈ వర్గానికి చెందిన మహారాజ అనంత్ రాయ్ చెప్పుకొచ్చారు. త్రేతాయుగంలో బిహార్‌లోని మిథిలాపురిని, కలియుగంలో కామ్తా రాజ్యాన్ని పాలించామని తెలిపారు. ఈ కామ్తానే ఇప్పటి బెంగాల్‌లోని కూచ్ బెహార్. స్వాతంత్ర్యం అనంతరం వీరి ప్రాంతాన్ని ఓ జిల్లాగా మార్చి బెంగాల్‌లో కలిపేశారు. ఇది అక్రమం, రాజ్యాంగ విరుధ్ధం అనేది వీరి వాదన. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 10, 2025

అందెశ్రీ మృతిపై కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ సంతాపం

image

ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం KCR, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని KCR అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆకాంక్షించారు.

News November 10, 2025

పచ్చిపాలతో ముఖానికి మెరుపు

image

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.

News November 10, 2025

రాహుల్ గాంధీకి పనిష్మెంట్.. 10 పుష్ అప్స్

image

మధ్యప్రదేశ్‌లోని పచ్‌మర్హిలో జరిగిన INC సమావేశానికి అగ్రనేత రాహుల్ గాంధీ 20ని.లు ఆలస్యంగా వెళ్లారు. లేటుగా వచ్చిన వాళ్లు పనిష్మెంట్‌ను ఎదుర్కోవాలని ఆ ప్రోగ్రామ్ చీఫ్ సచిన్ రావు సరదాగా చెప్పారు. దీంతో ఆయన సూచన మేరకు రాహుల్ 10 పుష్ అప్స్ తీసిన తర్వాత కుర్చీలో కూర్చున్నారు. దీంతో అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు. కాగా రాహుల్ గతంలోనూ పలు కార్యక్రమాల్లో పుష్ అప్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.