News April 5, 2024
ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

TG: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News January 12, 2026
సుందర్ స్థానంలో బదోని

న్యూజిలాండ్తో తొలి వన్డేలో గాయపడి సిరీస్కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో వన్డేకు ఆయన జట్టులో చేరనున్నారు. సుందర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. లిస్ట్-ఏ క్రికెట్లో బదోని 27 మ్యాచుల్లో 693 రన్స్ చేయగా అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే గాయంతో పంత్ ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.
News January 12, 2026
ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు

ఏపీలో 14మంది IASలను బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా JCగా కల్పనకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్గా మయూర్ అశోక్, తిరుపతి JC, తుడా వైస్ ఛైర్మన్గా గోవిందరావు, కడప JCగా నిధి మీన, అనంతపురం JCగా విష్ణుచరణ్, అనకాపల్లి JCగా సూర్యతేజ, చిత్తూరు JCగా ఆదర్శ్ రాజేంద్రన్.
News January 12, 2026
అక్కడ 16 ఏళ్లలోపు వారికి నో SM… మనదగ్గర?

16 ఏళ్లలోపు పిల్లలకు DEC 10 నుంచి SMను ఆస్ట్రేలియా నిషేధించడం తెలిసిందే. ఈ ప్లాట్ ఫారాలకు ఆ వయసులోపు వారిని దూరంగా ఉంచాలని లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే మెటా 5,50,000 ఖాతాలను మూసివేసింది. ఇందులో ఇన్స్టాగ్రామ్ నుంచి 3,30,000, ఫేస్బుక్ 1,73,000, థ్రెడ్లో 40,000 ఖాతాలు రద్దయ్యాయి. మన దగ్గర కూడా ఇలా చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?


