News April 5, 2024

ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

image

TG: సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News December 28, 2025

డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ ఏమన్నారంటే?

image

హీరోయిన్ నిధి అగర్వాల్ #ASKNIDHI అంటూ ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఒకరు ‘ఏ కాస్ట్యూమ్/అవుట్ ఫిట్ ధరించడం మీకు ఇష్టం?’ అని అడిగారు. అందుకు ‘నన్, ఏంజెల్ కాస్ట్యూమ్ ఇష్టం’ అంటూ నిధి చెప్పారు. ఆమె రాజాసాబ్ చిత్రంలో నన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ వస్త్రధారణపై జరుగుతున్న చర్చలో <<18661197>>నిధి<<>> పేరు హైలైట్ కావడంతో ఆమె ఇచ్చిన ఆన్సర్ SMలో వైరలవుతోంది.

News December 28, 2025

వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. మస్క్ ఆగ్రహం

image

కెనడాలో సరైన చికిత్స అందక భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్(44) మృతి చెందడంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన ప్రశాంత్‌ను 8 గంటలపాటు వెయిట్ చేయించారు. దీంతో కెనడా హెల్త్‌కేర్ సిస్టంను US మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్‌తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

News December 28, 2025

U-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

image

చిన్న వయసులోనే తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. కేవలం 14ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా U-19తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. U-19 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో BCCI వైభవ్‌కు బాధ్యతలు అప్పగించింది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.