News April 5, 2024
ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

TG: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News December 27, 2025
ఇక తక్కువ అద్దెకే రైతుకు సాగు పరికరాలు

AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు తక్కువ ఖర్చుతో సాగుకు అవసరమయ్యే పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 300 CHCల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక్కడ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్షలు చేసే కిట్స్, మినీ రైస్ మిల్లు, ఇతర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందిస్తారు.
News December 27, 2025
PCOS ఉన్నా పిల్లలు పుట్టాలంటే?

ప్రస్తుతకాలంలో చాలామంది PCOS వల్ల సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవారు బరువు తగ్గడం, ఇన్సులిన్ అదుపులో ఉంచుకోవడం, డీ విటమిన్ లోపం రాకుండా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులను కలిసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. యోగా, ధ్యానం చేయడం, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలంటున్నారు.
News December 27, 2025
ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి?

ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘విగ్రహాన్ని ఈశాన్యం, ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఉంచాలి. లక్ష్మీదేవితో కలిసి ఉన్న విగ్రహం మరింత శుభప్రదం. విగ్రహం 6 అంగుళాల లోపు ఉండటం శ్రేయస్కరం. శేషశయనం కంటే నిలబడి/కూర్చున్న విగ్రహాలు నిత్య పూజకు మంచివి. విగ్రహాన్ని నేరుగా నేలపై కాకుండా పీఠంపై, మన ఛాతీ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు.


