News April 5, 2024
ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

TG: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News July 9, 2025
5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
News July 9, 2025
YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశాయి.
News July 9, 2025
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. Sensex 46 పాయింట్ల లాభంతో 83,665 పాయింట్ల వద్ద,, Nifty 10 పాయింట్ల నష్టంతో 25,512 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, JSW స్టీల్, ICICI, HDFC, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో షేర్లు నష్టాల్లో, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతీ సుజుకీ, M&M, సిప్లా, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.