News December 16, 2024

జాకీర్ హుస్సేన్ మరణంపై సచిన్ దిగ్భ్రాంతి

image

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌ మరణంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంతాపం ప్రకటించారు. ‘ఆయన దరువులు మన హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉండిపోతాయి. ఆయన చేతులు లయలను అందిస్తే, చిరునవ్వు & వినయపూర్వకమైన వ్యక్తిత్వం మనసుకు దగ్గర చేశాయి. మీ మాయాజాలాన్ని చూసే అదృష్టం మాకు కలిగింది. మీ సంగీతానికి హద్దులు లేవు. మీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తీరనిలోటు’ అని తెలిపారు.

Similar News

News October 13, 2025

మోదీని కలవడం గర్వంగా ఉంది: CM చంద్రబాబు

image

AP: ఢిల్లీలో PM మోదీతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. ఆయన్ను కలవడం గౌరవంగా ఉందని CM ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పా. GST సంస్కరణల విషయంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించా. కర్నూలులో జరిగే ‘సూపర్ GST-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి ఆహ్వానించా. NOV 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకి ఇన్వైట్ చేశా’ అని వెల్లడించారు.

News October 13, 2025

బందీల విడుదల.. మహిళలు ఏమయ్యారు?

image

గాజా పీస్ ప్లాన్‌లో భాగంగా హమాస్ మిగతా 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. రెండేళ్ల తర్వాత వారు కుటుంబాలను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బతికున్న వారందరినీ రిలీజ్ చేసినట్లు హమాస్ ప్రకటించింది. అయితే వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన సమయంలో మహిళలను అపహరించి హమాస్ అకృత్యాలకు పాల్పడింది. వారిని చంపేసిందా? లేదా తమ అధీనంలోనే పెట్టుకుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

News October 13, 2025

8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

image

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.