News December 16, 2024
జాకీర్ హుస్సేన్ మరణంపై సచిన్ దిగ్భ్రాంతి
ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సంతాపం ప్రకటించారు. ‘ఆయన దరువులు మన హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉండిపోతాయి. ఆయన చేతులు లయలను అందిస్తే, చిరునవ్వు & వినయపూర్వకమైన వ్యక్తిత్వం మనసుకు దగ్గర చేశాయి. మీ మాయాజాలాన్ని చూసే అదృష్టం మాకు కలిగింది. మీ సంగీతానికి హద్దులు లేవు. మీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు తీరనిలోటు’ అని తెలిపారు.
Similar News
News January 25, 2025
అప్పట్లో.. మామూలు హడావిడి కాదు! కదా..?
జెండా పండుగలు 90s కిడ్స్కు స్పెషల్ మెమొరీ. ఆటలపోటీలు, క్లాస్ రూం డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పరేడ్, జెండావందనం, ప్రసంగం. ఇప్పుడంటే మెడల్స్, ట్రోఫీలు కానీ అప్పట్లో సోప్ బాక్స్, గ్లాసు, గిన్నెలే ప్రైజులు. చివరికి ఇచ్చే బిస్కెట్లు/చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంత ఫీజు కడితే ఇచ్చేదివేనా? అని మనోళ్ల తిట్లు.
మీ మెమొరీ కామెంట్ చేయండి.
News January 25, 2025
స్టైలిష్ లుక్లో రవితేజ.. రేపు గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన స్టైలిష్గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.