News March 17, 2024
ASRTU స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా సజ్జనార్

TSRTC ఛైర్మన్ సజ్జనార్ను మరో పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్(ASRTU) స్టాండింగ్ కమిటీ నూతన ఛైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ASRTU 54వ జనరల్ బాడీ మీటింగ్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సజ్జనార్ ఆ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా TSRTC చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు.
Similar News
News April 16, 2026
గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.
News April 16, 2026
మహిళలకు LSలో 272 సీట్లు: కేంద్ర మంత్రి

ఉమెన్ రిజర్వేషన్ల అమలు ద్వారా లోక్సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వు అవుతాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఆయన LSలో ప్రవేశపెట్టారు. ‘LS స్థానాలు 543 నుంచి గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల నుంచి 815, UTల నుంచి 35 ఉంటాయి. రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయి. స్త్రీలకు 272 దక్కుతాయి. ఇవి 33%కి సమానం’ అని తెలిపారు.
News April 16, 2026
‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>


