News December 27, 2024
నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్తో మెయిల్ మార్చాలని బ్యాంక్కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News January 1, 2026
సర్ఫరాజ్ను నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు: వెంగ్సర్కార్

దేశవాళీ క్రికెట్లో భారీగా రన్స్ చేస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు నిరాశే ఎదురవుతోంది. VHTలో గోవాతో జరిగిన మ్యాచ్లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ అసహనం వ్యక్తం చేశారు. “ఇది నిజంగా సిగ్గుచేటు. మ్యాచ్ విన్నర్ను పక్కనపెట్టడం అన్యాయం” అంటూ విమర్శలు గుప్పించారు.
News January 1, 2026
చెడు శకునాలు ఎదురైతే?

చెడు శకునాలు ఎదురైనా, అశుభ సంకేతాలు కనిపించినా కొన్ని మార్గాలతో దోష నివారణ చేసుకోవచ్చు. ‘పసుపు కలిపిన గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ విభూతి, తులసి తీర్థం చల్లాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. విజ్ఞులు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దానధర్మాల వల్ల ఆపదల తీవ్రత తగ్గుతుంది. శకునాలు హెచ్చరికలు మాత్రమేనని, సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా కష్టాలను దాటొచ్చని పండితులు చెబుతున్నారు.
News January 1, 2026
ఈనెలలోనే అందుబాటులోకి వందేభారత్ స్లీపర్: కేంద్ర మంత్రి

వందేభారత్ స్లీపర్ రైలు జనవరిలో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గువాహటి-కోల్కతా రూట్లో తొలి రైలు పరుగులు పెడుతుందని తెలిపారు. 3 టైర్ కోచ్లు 11, 2 టైర్ 4, ఫస్ట్ AC కోచ్ 1 ఉంటుందని మొత్తం 823 పాసింజర్లు ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే 6 నెలల్లో మరో 8, ఏడాది చివరికి 12 ట్రైన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. 15-20 రోజుల్లో సర్వీసులు స్టార్ట్ అవుతాయని చెప్పారు.


