News December 27, 2024
నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్తో మెయిల్ మార్చాలని బ్యాంక్కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News January 29, 2026
అమెరికా-చైనా పోటీ.. ఇండియాకు బిగ్ వార్నింగ్!

ప్రపంచంలో కీలకమైన శక్తిగా భారత్ ఎదగాలని ఆర్థిక సర్వే సూచించింది. లేదంటే టెక్నాలజీ పరంగా ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రావొచ్చని హెచ్చరించింది. ప్రపంచం ఆయిల్, స్టీల్ కాలం నుంచి ‘కంప్యూట్’ పవర్ కాలంలోకి ప్రవేశించిందని తెలిపింది. US సెమీకండక్టర్లు, AI, కీలక ఖనిజాలపై పట్టు సాధిస్తుంటే చైనా దీటుగా స్పందిస్తోందని పేర్కొంది. వీటి పోరు మధ్య భారత్ కేవలం ‘బ్యాక్ ఆఫీస్’లా మిగిలిపోవద్దని స్పష్టం చేసింది.
News January 29, 2026
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
News January 29, 2026
నోటీసులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు: KTR

TG: KCRకు <<18992001>>నోటీసులు<<>> ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు’ అని ట్వీట్ చేశారు.


