News December 27, 2024
నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!
MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్తో మెయిల్ మార్చాలని బ్యాంక్కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News January 22, 2025
CHAMPIONS TROPHY: పాకిస్థాన్కు మరో షాక్?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ పాకిస్థాన్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్, కెప్టెన్ల ఫొటో షూట్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం. రోహిత్ కోసమే ఓపెనింగ్ సెర్మనీ వేదిక మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా స్టేడియాల మరమ్మతులు ఇంకా ఫినిష్ చేయలేక పాక్ కిందా మీదా పడుతోంది.
News January 22, 2025
భార్యతో సెల్ఫీ ఎంత పని చేసింది
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యతో దిగిన సెల్ఫీనే తన మరణానికి దారితీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. 2016లో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ పోలీసులకు చిక్కింది. దీని ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో చలపతి సహా 27 మంది మావోలు చనిపోయారు.
News January 22, 2025
ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్
ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా భజన్ సింగ్కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.