News August 13, 2024

ఏడాదికి రూ.2.52 లక్షల జీతం.. కాగ్నిజెంట్‌పై ట్రోల్స్!

image

MNCలూ బీటెక్ పూర్తిచేసిన ఫ్రెషర్స్‌కు రూ.20వేలు మాత్రమే జీతం ఇస్తున్నాయి. తాజాగా 2024 బ్యాచ్‌కి చెందిన వారికోసం ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే, దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. చదువు లేకపోయినా మోమోస్ దుకాణంలో హెల్పర్‌గా చేస్తే నెలకు రూ.25వేలు ఇస్తున్నారని
ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

Similar News

News February 8, 2025

GOOD NEWS.. వారికి రూ.12,000

image

AP: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అగ్రికల్చర్, పశువైద్య విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను ₹7K నుంచి ₹10Kకు, PG స్టూడెంట్లకు ₹12Kకు పెంచింది. అలాగే సన్న రకం వరి సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు BC కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 8, 2025

వరకట్నం కేసుల్లో కుటుంబం మొత్తాన్ని చేర్చడం తప్పు: సుప్రీం కోర్టు

image

వరకట్నం కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందితులుగా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. స్పష్టమైన ఆరోపణలుంటేనే వారిపై కేసు పెట్టాలని పేర్కొంది. ‘వైవాహిక వివాదాలు సాధారణంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగాల కారణంగానే తలెత్తుతాయి. భర్త మీద కోపాన్ని అతడి కుటుంబీకులపై చూపించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అలా అందర్నీ ఇరికించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది.

News February 8, 2025

10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్

image

ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.

error: Content is protected !!