News July 11, 2024

‘తల్లికి వందనం’పై జీవోను సవరించాలి: అంబటి రాంబాబు

image

AP: మోసాలు చేయడం CM చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన GOను సవరించాలని, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News December 10, 2025

25వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం SSC నోటిఫికేషన్ జారీ చేసింది. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాలన్నింటికీ కలిపి 25,487 ఖాళీలు భర్తీ చేయనుంది. 2026 JAN1 నాటికి టెన్త్ పాసైన 18-23సం.ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులు. DEC 1 నుంచి మొదలైన <>ఆన్‌లైన్ అప్లికేషన్ల<<>> స్వీకరణ 2025 DEC 31తో ముగియనుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
Share It

News December 10, 2025

APPLY NOW:TIFRలో ఉద్యోగాలు..

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

News December 10, 2025

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.