News July 11, 2024
‘తల్లికి వందనం’పై జీవోను సవరించాలి: అంబటి రాంబాబు

AP: మోసాలు చేయడం CM చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన GOను సవరించాలని, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2025
MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
News November 17, 2025
తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఫోన్ హ్యాక్

తుని మున్సిపల్ ఛైర్పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్స్కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.


