News July 11, 2024
‘తల్లికి వందనం’పై జీవోను సవరించాలి: అంబటి రాంబాబు

AP: మోసాలు చేయడం CM చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన GOను సవరించాలని, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News February 14, 2025
ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
News February 14, 2025
రేవంత్వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.
News February 14, 2025
ట్రెండింగ్.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.