News January 19, 2025

సెల్యూట్ మేడమ్.. 42 మందిని కాపాడిన నీర్జా

image

ప్రాణాలు పణంగా పెట్టి 42 మందిని కాపాడిన ఫ్లైట్ అటెండ్ నీర్జా భానోత్ గురించి ఎంత మందికి తెలుసు? 1986 సెప్టెంబరు 5న ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తోన్న ఫ్లైట్‌ హైజాక్‌ అయింది. ఆ సమయంలో నీర్జా ఎంతో చాకచక్యంగా అమెరికన్ల పాస్‌పోర్టులు దాచి అమెరికన్లను గుర్తించకుండా చేసి కాపాడారు. అయితే, కాల్పుల్లో పిల్లలను కాపాడేందుకు అడ్డుగా నిలబడి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఆమె ధీరత్వానికి 1987లో అశోక చక్ర వరించింది.

Similar News

News February 19, 2025

జాక్‌పాట్ కొట్టిన రేఖా గుప్తా

image

ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) MLA రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. రేఖ అనూహ్యంగా సీఎం అభ్యర్థి రేసులోకి వచ్చారు. పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ వంటి హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆమె వైపే మొగ్గు చూపింది. అలాగే దేశంలోని NDA పాలిత రాష్ట్రాల్లో ఈమె ఒక్కరే మహిళా సీఎం కావడం విశేషం.

News February 19, 2025

నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

image

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News February 19, 2025

సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

image

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.

error: Content is protected !!