News December 17, 2024

వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా సామీ

image

వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ డారెన్ సామీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన వన్డే, టీ20లకు హెడ్ కోచ్‌గా ఉన్నారు. తాజాగా టెస్టులకు కూడా సామీ కోచ్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి సామీ టెస్టు టీమ్‌కి తన సేవలందిస్తారు. కాగా సామీ సారథ్యంలోనే విండీస్‌కు రెండు టీ20 WCలు వచ్చాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌కు విండీస్ అర్హత సాధించకపోవడంతో విండీస్ బోర్డు ఆయనను కోచ్‌గా నియమించింది.

Similar News

News January 24, 2025

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

image

AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.

News January 24, 2025

త్వరలో RTCలో నియామకాలు: మంత్రి

image

TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.

News January 24, 2025

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల

image

AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.