News October 18, 2024

అడ్డగోలు ధరలకు ఇసుక విక్రయాలు: జగన్

image

AP: ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. తమ హయాంతో పోలిస్తే ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా రెండింతలు-మూడింతలు రేట్లు పెంచారని విమర్శించారు. పండుగ వేళ ఇసుక టెండర్లు పిలిచి సొంత వాళ్లకు దోచిపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ఇసుక పాలసీ పారదర్శకంగా ఉందని చెప్పారు. ఇటీవల మద్యం టెండర్లలోనూ భారీ కుంభకోణాలకు తెరదీశారని ఆరోపించారు.

Similar News

News September 18, 2025

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.

News September 18, 2025

Maturity Laws: ఇవి పాటించు గురూ!

image

* అందరికీ ప్రతీది చెప్పడం మానేయండి. ఎందుకంటే చాలా మంది వాటిని పట్టించుకోరు. బలహీనతలను అస్సలు చెప్పొద్దు
* స్నేహితులను తెలివిగా ఎంచుకోండి. సరైన స్నేహితులే మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు
* ఏమీ ఆశించకండి. అభినందించడం నేర్చుకోండి
* మీ వంతు కృషి చేయండి. ఫలితమేదైనా స్వీకరించండి.
* ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి.
* పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం అలవాటు చేసుకోండి.

News September 18, 2025

ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

image

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్‌లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.