News March 20, 2024
షమీ స్థానంలో సందీప్, మధుశంక స్థానంలో మఫకా

IPL: గాయపడ్డ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్ను తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన సందీప్.. ఇది వరకు ఆర్సీబీ, కేకేఆర్, ముంబై తరఫున ఆడారు. ఇక ముంబై పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫకాను టీంలోకి తీసుకున్నారు. మఫకా అండర్-19 WCలో అత్యధిక వికెట్లు తీశారు.
Similar News
News January 29, 2026
బిహార్లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

మహిళా ఉపాధి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని బిహార్ ప్రభుత్వం భారీగా పెంచింది. తమ హామీ మేరకు ₹2 లక్షలకు పెంచుతున్నట్లు CM నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు. 1.56 కోట్ల మందికి తొలి విడతలో ₹10 వేలు ఇచ్చామని పేర్కొన్నారు. వీరంతా 6 నెలల తర్వాత అదనపు సాయం పొందడానికి అర్హులవుతారని తెలిపారు. గతంలో ఇచ్చిన ₹10 వేలను ఉపాధి కోసం ఎంత సమర్థంగా ఉపయోగించారనే దాని ఆధారంగా దశలవారీగా మిగతా మొత్తం ఇస్తామని చెప్పారు.
News January 29, 2026
తిరుమల లడ్డూ.. YCP vs టీడీపీ, జనసేన

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని సిట్ పేర్కొందని, చంద్రబాబు, పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని వైసీపీ వరుస పోస్టులు చేస్తోంది. వారు క్షమాపణలు చెప్పాలని #ApologizeToDevotees అనే హాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తోంది. అటు లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని, కెమికల్స్తో చేసినట్లు సిట్ పేర్కొందని టీడీపీ, జనసేన శ్రేణులు #NoGheeInTTDLaddu అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.
News January 29, 2026
రేపు ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’: భూమన

AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI ఛార్జ్షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. రేపు 10AMకు తిరుపతిలో ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ చేపడతామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.


