News December 9, 2024
ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్గా కొనసాగుతారు.
Similar News
News October 14, 2025
బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

అక్టోబర్లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.
News October 14, 2025
సత్యం వైపు మార్గం చూపేదే ‘వేదం’

భగవంతుడు సత్య స్వరూపుడు. శాశ్వతుడు. కానీ ఈ జగత్తు అశాశ్వతం. సత్యమైన దేవుడే ఈ మిథ్యా లోకాన్ని సృష్టించాడు. ఈ అశాశ్వతమైన జీవులందరికీ ముక్తి ప్రసాదించి, తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోవడమే భగవంతుడి అంతిమ లక్ష్యం. జీవులు తిరిగి సత్యం వైపు పయనించడానికి, శాశ్వత స్థితిని పొందడానికి అవసరమైన దేవ మార్గాన్ని(మోక్ష మార్గాన్ని) స్పష్టంగా తెలియజేసేదే వేదం. అందుకే వేదమే సృష్టి ప్రయోజనాన్ని వివరిస్తుంది. <<-se>>#VedikVibes<<>>
News October 14, 2025
రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్లు, CII ప్రతినిధులు, ఎక్స్పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.