News December 9, 2024
ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733745780650_746-normal-WIFI.webp)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్గా కొనసాగుతారు.
Similar News
News January 22, 2025
సమంత ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737528311954_746-normal-WIFI.webp)
టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగు సినిమాల్లో నటించట్లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. ఇటు మీడియాకూ ఆమె దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్స్టాలో పంచుకున్నారు. ఇటీవల ఆమె చికున్ గున్యా నుంచి కోలుకున్నారు. ఆమె చాలా సన్నపడ్డారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
News January 22, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్గంజ్ కాల్పుల దొంగలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737038522828_653-normal-WIFI.webp)
కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్గంజ్లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్కు, లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
News January 22, 2025
టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737528076634_1199-normal-WIFI.webp)
టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్నేమ్ పాకిస్థాన్ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.