News January 6, 2025
11 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
AP: నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 12న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి వాహనసేవలు, 14న కల్యాణం, 16న యాగ పూర్ణాహుతి, త్రిశూలస్నానం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజైన 17న పుష్పోత్సవం నిర్వహిస్తారు.
Similar News
News January 20, 2025
ఈ నెల 28 నుంచి నాగోబా జాతర
TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
News January 20, 2025
పేరుకే ‘పెద్దన్న’.. జీతం వారికన్నా తక్కువే
పెద్దన్నగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతల కంటే తక్కువే. యూఎస్ అధ్యక్షుడి గౌరవ వేతనం ఏడాదికి రూ.4 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.46 కోట్లు. సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి సుమారు రూ.13.85 కోట్లు, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలరీ రూ.6 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి రూ.4.9 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా వారికి అదనపు భత్యాలు అందుతాయి.
News January 20, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.