News December 3, 2024
1967 తర్వాత మళ్లీ HYDలో ‘సంతోష్ ట్రోఫీ’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733191722648_782-normal-WIFI.webp)
నేషనల్ సీనియర్ ఫుట్బాల్ ఛాంఫియన్షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. చివరిగా 1967లో HYD ఆతిథ్యం ఇవ్వగా, 57 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశమొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 14- 31 వరకు క్వార్టర్స్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించనున్నట్లు భారత ఫుట్బాల్ సమాఖ్య తెలిపింది. ఫైనల్ రౌండ్ టోర్నీలో 12జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77సార్లు జరిగింది.
Similar News
News January 18, 2025
మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737188607021_367-normal-WIFI.webp)
TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.
News January 18, 2025
సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737187381748_367-normal-WIFI.webp)
సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.
News January 18, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737185027392_893-normal-WIFI.webp)
టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశానన్నారు.