News June 1, 2024
చెక్కతో శాటిలైట్.. అక్టోబర్లో ప్రయోగం
ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారుచేసిన లిగ్నోశాట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ సైంటిస్టులు అక్టోబర్లో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా కాలిపోతుంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మాగ్నోలియా అనే కలపతో అన్నివైపులా 10CM పొడవుతో దీన్ని రూపొందించారు. క్యోటో వర్సిటీ, సుమిటోవా ఫారెస్ట్రీ భాగస్వామ్యంతో 2020 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
Similar News
News October 13, 2024
సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత
AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.
News October 13, 2024
క్రిశాంక్కు మెయిన్హార్ట్ సంస్థ నోటీసులు
TG: BRS నేత మన్నె క్రిశాంక్కు సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.
News October 13, 2024
రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.