News November 21, 2024

PM కిసాన్, PM ఆవాస్ పేరుతో మోసాలు

image

TG: PM కిసాన్, PM ఆవాస్ యోజన పేరుతో వచ్చే SMSలను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ SMSలు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. APK ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి APK ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలంది.

Similar News

News March 10, 2026

AIతో అమ్మాయిల లవ్.. ఆందోళనలో చైనా?

image

చైనాలో యువతులు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ‘AI బాయ్‌ఫ్రెండ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక ఒత్తిళ్లు, పెళ్లి పట్ల విరక్తితో కోట్లాది మంది ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పడిపోతున్న జననాల రేటును మరింత తగ్గిస్తుందని చైనా భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తెచ్చింది. చాట్‌బాట్‌ల వాడకంపై టైమ్ లిమిట్, సోషల్ వాల్యూస్ బ్రేక్‌పై నిఘా పెంచింది.

News March 10, 2026

హోటళ్లే కాదు.. హాస్టళ్లలోనూ ఇబ్బందులే!

image

కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ లేక బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే అనేక <<19341968>>హోటళ్లు<<>> మూతపడ్డాయి. ఇదే సెగ హైదరాబాద్‌కు తాకే ప్రమాదం ఉంది. హాస్టళ్లలోనూ వంట నిలిచిపోతే వేలాది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడనున్నారు. బయట హోటళ్లు కూడా క్లోజ్ అయితే తిండి కష్టాలు తప్పవని నెటిజన్లు వాపోతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.

News March 10, 2026

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 78,205కు చేరగా, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ 30లో మహీంద్రా & మహీంద్రా (+3.67%), ఇండిగో (+3.21%), ఏషియన్ పెయింట్స్ (+3.13%), మారుతీ (+2.94%) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు కోలుకోవడం, రూపాయి విలువ మళ్లీ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.