News February 5, 2025
స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

స్వీడన్ ఒరెబ్రో సిటీలోని ఓ విద్యాసంస్థలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. చనిపోయిన వారి వయసును, వారిలో విద్యార్థులు, టీచర్లు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్లు వివరించారు. అనుమానిత దుండగుడిని కూడా హతమార్చినట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇదొక భయంకరమైన ఘటన అని చెప్పారు.
Similar News
News April 2, 2026
ఆ థియేటర్లలో ఇక పర్సెంటేజీ సిస్టమ్: ఎగ్జిబిటర్ల నిర్ణయం

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News April 2, 2026
కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

UP కాన్పూర్లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
News April 2, 2026
గుడ్ న్యూస్: రూ.7,358 కోట్లు దశలవారీ చెల్లింపు

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.


