News October 29, 2024
రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు SCR చర్యలు

దీపావళి వేళ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. SECBAD, HYD, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి స్టేషన్లలో ప్రత్యేక RPF సిబ్బంది రద్దీని నియంత్రిస్తారు. స్టేషన్లలో స్పెషల్ లైన్లు ఏర్పాటు చేస్తారు. టికెట్ కౌంటర్లను కూడా పెంచినట్లు SCR తెలిపింది. పండగ కోసం 850 స్పెషల్ ట్రైన్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వివరించింది.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


