News August 11, 2024
అదానీపై సెబీ దర్యాప్తు: కాంగ్రెస్ డిమాండ్ ఇదే

అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తొలగించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. JPC ద్వారానే స్కామ్ను పూర్తిగా దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. అంతిమ ప్రయోజనం పొందే ఫారిన్ ఫండ్స్ యజమాని ఎవరో తెలిపే ప్రక్రియను సెబీ 2019లో రద్దు చేయడాన్ని SC కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. పార్లమెంటును రెండ్రోజుల ముందే నిరవధిక వాయిదా ఎందుకేశారో ఇప్పుడు అర్థమవుతోందని సెటైర్ వేసింది.
Similar News
News November 21, 2025
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్వాంటెడ్ మెసేజ్లు ఇన్బాక్స్లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 21, 2025
FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.
News November 21, 2025
25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.


