News May 18, 2024

పట్టుబడ్డ ఎన్నికల సొత్తు విలువ రూ.8,889 కోట్లు: ఈసీ

image

ఇప్పటివరకు పట్టుకున్న ఎన్నికల నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇది ఎన్నికలు ముగిసే నాటికి మరింత పెరగొచ్చని అంచనా వేసింది. డ్రగ్స్, లిక్కర్ పట్టుకోవడంపై ఈ సారి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. 3 రోజుల్లో ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

Similar News

News November 11, 2025

ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

image

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్‌కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్‌లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.

News November 11, 2025

ధనియాల సాగు – అనువైన రకాలు

image

మనదేశంలో రబీ పంటగా అక్టోబర్-నవంబర్ నెలల్లో ధనియాలు నాటుతారు. ఈ పంట ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. APలో రాయలసీమ జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.
☛ ధనియాల సాగుకు అనువైన రకాలు – సి.ఒ.1, సి.ఒ.2, సి.ఒ.3, సి.ఒ.(సి.ఆర్)4, సి.ఎస్.287, కరన్, సి.ఐ.ఎం.ఎస్-33, సి.ఎస్.2, జి.ఎ.యు-1, యు.డి-1, యు.డి-2, యు.డి-20, యు.డి-21. వీటిలో అనువైన రకాలను వ్యవసాయ నిపుణుల సూచనలతో నాటుకోవాలి.

News November 11, 2025

BP ట్యాబ్లెట్స్ వాడటం మానేస్తున్నారా?

image

గత నెల రోజులుగా BP (అధిక రక్తపోటు) ట్యాబ్లెట్స్ మానేయడంతో అందెశ్రీ మరణించారని <<18254470>>వైద్యులు<<>> నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇలా బీపీ ట్యాబ్లెట్స్ ఆపడం ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి, పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులను ఆపొద్దని/మార్చొద్దని, ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చని చెబుతున్నారు. SHARE IT