News August 9, 2024
నెలాఖరున పీసీసీ చీఫ్ ఎంపిక?

TG: ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇస్తే మహేశ్కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, లంబాడాలకు ఇస్తే బలరాం నాయక్, ఎస్సీలకు కేటాయిస్తే సంపత్ కుమార్లలో ఎవరో ఒకరికి పీసీసీ పీఠం దక్కనున్నట్లు సమాచారం. ప్రచార కమిటీ ఛైర్మన్గా జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 2, 2026
హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

కేంద్ర బడ్జెట్లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 2, 2026
ఇండియన్ నేవీలో 260 పోస్టులు

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.
News February 2, 2026
రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.


