News August 9, 2024
నెలాఖరున పీసీసీ చీఫ్ ఎంపిక?

TG: ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇస్తే మహేశ్కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, లంబాడాలకు ఇస్తే బలరాం నాయక్, ఎస్సీలకు కేటాయిస్తే సంపత్ కుమార్లలో ఎవరో ఒకరికి పీసీసీ పీఠం దక్కనున్నట్లు సమాచారం. ప్రచార కమిటీ ఛైర్మన్గా జగ్గారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 13, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 13, 2026
శివుడు లింగాకారంలో ఎందుకు?

శివుడు లింగాకారంలో పూజలందుకుంటాడు. అందుకు పురాణాలు 2 కారణాలు చెబుతున్నాయి. వరాహ పురాణం ప్రకారం.. భృగు మహర్షి శాపం వల్ల శివుడు విగ్రహ రూపం వదిలి లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. అయితే తాత్విక కోణంలో ‘లింగం’ అంటే ఓ ‘గుర్తు’ లేదా ‘సంకేతం’. నిరాకారుడు, అనంతమైన శూన్య స్వరూపుడైన పరమాత్మను ఆరాధించడానికి శివలింగం ఓ పవిత్ర చిహ్నం. అందుకే రూపం లేని ఆ పరమేశ్వరుడిని భక్తులు లింగరూపంలో కొలుస్తారు.


