News February 8, 2025

సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్‌కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.

Similar News

News March 26, 2025

భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

image

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్‌ డేటాబేస్‌ (ఆధార్‌)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.

News March 26, 2025

నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

image

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్‌లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్‌ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.

News March 26, 2025

లంచ్‌లో వీటిని తీసుకుంటున్నారా?

image

కొందరు మధ్యాహ్న భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. కానీ ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కువగా సలాడ్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్, పెరుగు తినాలి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లు తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. లంచ్‌లో గుడ్లు, చేపలు తినడం ఉత్తమం.

error: Content is protected !!