News August 20, 2024

రాష్ట్రంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి

image

AP: రాష్ట్రంలో CBI విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. అయితే స్టేట్ ఎంప్లాయిస్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అప్పట్లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు రాష్ట్రంలో CBI విచారణను రద్దు చేశారు.

Similar News

News December 16, 2025

భార్య నల్లగా ఉందని..

image

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2025

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

image

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్‌ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.

News December 16, 2025

హనుమంతుడి కుమారుడి గురించి మీకు తెలుసా?

image

పురాణాల ప్రకారం.. హనుమంతుడి చెమట చుక్క ద్వారా ఓ మకరానికి మకరధ్వజుడు జన్మించాడు. ఆయన పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. అయితే ఓనాడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తారు. అప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి, తన కుమారుడైన మకరధ్వజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు నిజం తెలుసుకొని మకరధ్వజుడు శ్రీరాముడికి సాయం చేస్తాడు.